సీమాంధ్ర శక్తి చూపిస్తాం: టిజి వెంకటేష్

హైదరాబాద్,జులై 7:  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర శక్తి చూపిస్తామని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ హెచ్చరించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తెలంగాణ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకమని ఆయన కర్నూలులో అన్నారు. ఉద్యమాలు చేయాలనుకుంటే తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మితిమీరి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి పాలన వస్తే కొంపలేం మునిగిపోవని ఆయన అన్నారు. కాగా, కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీన తమ వాదనలను పార్టీ అధిష్టానానికి వివరిస్తామని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు