హైదరాబాద్: శ్రీరామరాజ్యం షూటింగ్లో ప్రముఖ నటి నయనతార కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇదే తన చివరి చిత్రం అని ఆమె విలపించారు. పెళ్లైన తరువాత సినిమాలలో నటించనని చెప్పారు. చిత్ర దర్శకుడు బాపుతోపాటు ఇతర పెద్దలకు పాదాభివందనం చేశారు. తన వద్ద ఉన్న వస్తువులు అన్నింటినీ తన సహాయకులకు ఇచ్చివేశారు. తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని వ్యక్తిగత మేకప్ మ్యాన్ కు కు ఇచ్చారు. పెళ్లైనప్పటికీ సినిమాలలో నటించవచ్చని హీరో బాలకృష్ణ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే పెళ్లైన తరువాత సినిమాలలో నటించడానికి ప్రభుదేవా ఒప్పుకోరని ఆమె ఏడుస్తూనే చెప్పారు. శ్రీరామరాజ్యంలో నయనతార సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లైన తరువాత సినిమాలలో నటించకూడదన్న ఒప్పందంపైనే నయనతారని ప్రభుదేవా వివాహం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఇంతకాలంగా సినీపరిశ్రమతో ఉన్న అనుబంధం తెగిపోతుందని ఆమె బాధపడ్డారు. వచ్చే నెలలో నయనతార, ప్రభుదేవాల వివాహం జరగనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment