Monday, July 4, 2011

కొంప అంటించి చుట్ట కాల్చుకోవడం అంటే ఇదే...!

న్యూఢిల్లీ,జులై 4‌: న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై కేంద్రమంత్రి చిదంబరం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామా తర్వాత సైతం ఆయన చాలా కూల్ గా స్పందించడం గమనార్హం. అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. సోమవారం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రం అంశంపై ఇంకా నిర్ణయమే తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు తమను ఏమీ ఆశ్చర్యం కలిగించలేదన్నారు. రాజీనామాల వల్ల తలెత్తిన పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు,  పార్లమెంటు సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతాయని అన్నారు. సంప్రదింపుల తర్వాతే స్పష్టమైన ప్రకటన ఉంటుందన్నారు. ఏకాభిప్రాయం కుదిరే వరకు సంప్రదింపులు కొనసాగుతాయన్నారు. అఖిలపక్షం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకుంటామని చెప్పారు.ఇంకా రెండు పార్టీలు తమ అభిప్రాయం చెప్పాల్సి ఉందన్నారు.  డిసెంబర్ 9 ప్రకటనను ప్రశ్నించే వారు డిసెంబర్ 23 ప్రకటనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల రాజీనామాలపై తాను స్పందించనన్నారు. అది ఆ పార్టీకి సంబంధించిన అంశమన్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...