వాషింగ్టన్,జులై 30: యూనివర్శిటి ఆఫ్ నార్త్ వర్జీనియా (యూఎన్విఏ) లోని భారతీయ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమెరికా భరోసా ఇచ్చింది. వాషింగ్టన్ శివారు ప్రాంతంలోని నార్త్ వర్జీనియా యూనివర్శిటిని మూసివేసేందుకు అమెరికన్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 90 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వారే అధికంగా ఉన్నారు. యూఎన్విఏ విశ్వవిద్యాలయాన్ని వెంటనే మూసివేయడం లేదని, దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. అందుకు ఒక నెల గడువు విధించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు యూనివర్శిటీ నిరాకరించింది. ప్రవేశం ద్వారం వద్ద యూనివర్శిటీ తెరిచే ఉంటుందని నోటిసులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం గురువారం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించి విశ్వవిద్యాయానికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment