Wednesday, July 13, 2011
మీడియా ముందుకు ఆ ఇద్దరు...ఆ వెనుక జయ...?
చెన్నై,జులై 13: తమిళనాడు లో కరుణ సర్కార్ కూలిపోయి,జయ అధికారంలోకి రావడంతో సినీ నటి రంజిత, నిత్యానంద స్వామి లకు గొప్ప రిలీఫ్ వచ్చింది. రాసలీలల కేసులో ఇరుక్కున్న ఈ ఇద్దరు బుధవారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డిఎంకె , సన్ నెట్ వర్క్ లపై ధ్వజమెత్తారు. డిఎంకె తమను ఉద్దేశ పూర్వకంగానే రాసలీలల కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. తమను అనవసరంగా నిందించినందుకే ఆ పార్టీ ఓటమి పాలయిందన్నారు. ఆ పార్టీకి ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. జర్నలిజం పేరుతో తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని సన్ నెట్ వర్క్, నక్కీరన్పై వారు విరుచుకు పడ్డారు. వీడియోలో ఉన్నది తాము కాదని , వీడియోలను నక్కీరన్ మార్ఫింగ్ చేసి తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందని ఆరోపించారు. తమను అరవై కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. మార్పింగ్ వెనుక సన్ నెట్ వర్క్ హస్తం సైతం ఉందని వారు అభిప్రాయపడ్డారు. వీడియోలో ఉన్నది తాను కాదని , ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో తప్పుడు కథనాలు రాశారని నటి రంజిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు రంజితకు ఆశ చూపి తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని నిత్యానంద స్వామి ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment