హైదరాబాద్ ,జులై 12: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనల్ని మనం ఇప్పటికే చాలా హింసించుకున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు పంపిన సందేశంలో అన్నారు. దీక్షలు విరమించాలని కోరుతూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ సందేశం పంపించారు. రెండు రోజులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దీక్షలు చేస్తున్నారు. రెండు విశ్వవిద్యాలయ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఆయన ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. తన అభ్యర్థనను మన్నించి దీక్షలు విరమించాలని ఆయన విద్యార్థులను కోరారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల భవిష్యత్తు కోసమే జరుగుతోందని ఆయన అన్నారు. దీక్షల ద్వారా ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే మనల్ని మనం చాలా హింసించుకున్నామని, పదునైన వ్యూహాలతో రాజీలేని పోరాటం చేద్దామని ఆయన అన్నారు.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్షలు పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత గద్దర్ను పోలీసులు అడ్డుకున్నారు. బయటివారికి లోనికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment