మళ్ళీ బంద్ ల గోల ...
హైదరాబాద్ ,జులై 4: వీళ్ళు తెలంగాణా తెచ్చి ప్రజలకు ఎంత మేలు చేస్తారో గానీ ఇప్పుడు మాత్రం ప్రజాజీవనానికి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు. సోమవారం నాదు మీడియా సమావేశంలో చిదంబరం తెలగాణా పై లైట్ గా మాటాడిన మరు క్షణమే తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మంగళ, బుధవారాలలో 48 గంటల తెలంగాణా బంద్ తో పాటు ఐదు రోజుల ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు ఇచ్చేసింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ రాజీనామాలకు సంఘీభావంగా5,6,తేదీలలో బంద్, 7న విద్యార్థుల ర్యాలీ, 8, 9 తేదీల్లో రైలు రోకో ( ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ వెళ్లే రైళ్లని ఆపాలని ) నిర్వహిస్తారుట. ఇక 10వ తారీఖున తెలంగాణా జిల్లాలలో వంటావార్పు ఉంటుందట. ఆ తర్వాత వరుసగా ప్రతి రోజు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టే వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేయాలని జెఏసి నిర్ణయించుకుంది. మాములుగానే తెర వెనక వుండే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన 48 గంటల బంద్ కు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Comments