న్యూఢిల్లీ, జులై 25: కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్తో పార్టీ తెలంగాణ ప్రతినిధులు సోమవారం రాత్రి జరిపిన చర్చలు తూతూ మంత్రం గా ముగిశాయి. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను, దాని పరిణామక్రమాన్ని తెలంగాణ నాయకులు ఆజాద్కు వివరించారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంపై వారు ఆజాద్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర పాటు వారు ఆజాద్తో సమావేశమయ్యారు.
తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని సమావేశానంతరం మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానమే తమను చర్చలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి మరోసారి ఆజాద్తో సమావేశమవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదని తాము ఆజాద్తో చెప్పినట్లు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై రాజీ లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని సమావేశానంతరం మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానమే తమను చర్చలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి మరోసారి ఆజాద్తో సమావేశమవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదని తాము ఆజాద్తో చెప్పినట్లు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై రాజీ లేదని ఆయన అన్నారు.
No comments:
Post a Comment