Saturday, July 2, 2011

రాజీనామాలు చేసేది ఎందరు...?

 హైదరాబాద్ ,జులై 2:  ఎంత మంది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారనేది  అనుమానంగానే ఉంది. అసలు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు రాజీనామా చేస్తారా అనేది కూడా అనుమానమే. సోమవారం 11 గంటలకు ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు, హైదరాబాదులో శానససభ్యులు రాజీనామాలు చేస్తారని గట్టిగానే చెబుతున్నారు. బుజ్జగింపులు పనిచేయవని కూడా వారు కరాఖండిగా చెబుతున్నారు. కానీ, వారు ఆ మాట మీద నిలబడతారని తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం లేదు. కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. తెలంగాణపై తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తానని చెప్పినా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. అందువల్ల ఆయన నుంచి రాజీనామా రాదని స్పష్టం అవుతోంది. కాగా, ఈ పదవి కోసం పోటీ పడి భంగపడిన మంత్రి జె. గీతారెడ్డి మాత్రం రాజీనామాపై ఆవేశం గానే  ఉన్నారు.  తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉన్న హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు చాలా మంది రాజీనామాలకు ముందుకు రాకపోవచ్చు. హైదరాబాదు నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కూడా రాజీనామాలకు సిద్ధంగా లేరని అర్థమవుతోంది. అలాగే, రంగారెడ్డి జిల్లాకు చెందిన హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాంత నేతల సమావేశాలకు  ఆమె హాజరు కావడం లేదు.  లోకసభ సభ్యుడు సర్వే సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడకపోవచ్చు. శుక్రవారం ఏర్పాటైన కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో సగం మంది హాజరయ్యారు. ఈ సగం మంది కచ్చితంగా రాజీనామా చేస్తారని వివేక్, పొన్నం ప్రభాకర్ వంటి పార్లమెంటు సభ్యులు కచ్చితంగానే చెబుతున్నారు. అమెరికా నుంచి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ స్వదేశానికి బయలుదేరారు. ఏమైనా   అందరూ రాజీనామా చేయకపోయినా, సగం మంది రాజీనామా చేసినా కాంగ్రెసు ఇరకాటంలో పడుతుందనేది  వాస్తవం.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...