Sunday, July 31, 2011

భారత్, చైనా చమురు తాగెస్తున్నాయిట...!

వాషింగ్టన్,జులై 31: భారతీయులు ఎక్కువగా తింటున్నారు.. అందుకే ఆహార కొరత పెరుగుతోందని వ్యాఖ్యానించిన మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా నడుస్తున్నారు. భారత్, చైనా చమురును తెగ వాడేస్తున్నాయని, అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు చుక్కలనంటుతున్నాయని ఆయన వాపోయారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ చమురు ధరలకు అనుగుణంగా సాగుతోంది. ధరలు పెరిగితే ఒత్తిళ్ళకు లోనవుతోంది. చైనా, భారత్‌లాంటి దేశాల్లో చమురు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మరింత చేయి దాటిపోతోందని ఒబామా ఒక సదస్సులో వ్యాఖ్యానించారు. చమురు ఉత్పత్తి కన్నా డిమాండ్ శరవేగంగా పెరిగిపోతోంది. ఫలితంగా రేట్లూ పెరుగుతున్నాయి’ అని ఒబామా అన్నారు. శుక్రవారమిక్కడ ‘కార్లు, టక్కుల్లో ఇంధన సామర్థ్యం పెంపు’ అన్న అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని వెంటనే మార్చలేమని, ఇప్పట్నుంచి స్వదేశంలో మరింత చమురు ఉత్పత్తికి చర్యలు మొదలుపెడితే మున్ముందు స్వయంసమృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. 2025 కల్లా అమెరికాలోని కంపెనీలు తమ వాహనాల ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ప్రస్తుతం వారానికోసారి పెట్రోలు నింపుకునే కార్లు.. 2025కల్లా రెండు వారాలకోసారి పెట్రోలు పోయించుకునేలా పరిస్థితులు మారాలన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...