Sunday, July 31, 2011

వీసా మోసాలపై జాగ్రత్త సుమా... భారతీయ విధ్యార్ధులకు అమెరికా వార్నింగ్

వాషింగ్టన్ ,జులై 31: మోసపూరిత వీసాలు ఇచ్చే  ముఠాలతోను, నకిలీ డాక్యుమెంట్లందించే వ్యక్తులతోను భారతీయ విద్యార్ధులు జాగ్రత్త వహించాలని అమెరికా హెచ్చరించింది. వీసాలకు సంబంధించి ఫెడరల్ అధికార్లు నార్తరన్ వర్జినీయా యూనివర్శటీ పై  దాడి చేసిన సందర్భంలో అమెరికా ఈ హెచ్చరికను జారీ చేసింది.  విద్యార్ధుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని అమెరికాలో విద్య కొరకై వస్తున్న విద్యార్ధులు మోస పూరిత వీసాలు, నకిలీ పేపర్ల విక్రయదారులకు బలి కాకూడదన్న కారణంగా తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి  టోనర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నార్తరన్ వర్జినీయా యూనివర్శటీ పై ఫెడరల్ అధికార్లు దాడి చేసిన అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందని భారత ప్రభుత్వంతో సంప్రదిస్తామని  ఆయన తెలిపారు. న్యూఢిల్లీ లోని రాయబార కార్యాలయం విదేశీ వ్యవహారాల శాఖకు వివరించిందని, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్ మెంట్ లు భారత రాయబార కార్యాలయంతో సంప్రదిస్తూనే వున్నాయన్నారు. దర్యాప్తు సాగుతున్నందున మరిన్ని వివరాలందించలేమని తెలిపారు. 
తానా సపోర్ట్...
యూనివర్శిటీ ఆఫ్ నార్తన్న్ వర్జీనియా ) విద్యార్థులకు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర  వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే తానా సభ్యులందరికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికి సహాయం చేయాలని అందులో సూచించినట్లు పేర్కొన్నారు. బాధితులు తానా కార్యాలయంలో తమను నేరుగా లేదా తేం@తన.ఒర్గ్ కి ఈ మొయిల్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.దేశంలోని గుర్తింపు పొందిన, స్టూడెంట్ ఆండ్ ఎక్సేంజ్ విజిటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ (ఎస్‌ఈవిఐఎస్) ధృవపరిచిన కళాశాలల్లోకి  వీరందరని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యా సంవత్సరం మధ్యలో ఆగిపోకుండా చూస్తామన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...