నోళ్ళు పారేసుకోవద్దని అజాద్ సలహా...!

న్యూఢిల్లీ,జులై 18:  పరస్పర దూషణలు మానుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో గులాం నబీ ఆజాద్ చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆజాద్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ఈ సాయంత్రం  జరిగింది.  సంప్రదింపులు, విధివిధానాలపైనే చర్చ జరిగిందని తెలిసింది. ఆజాద్‌తో భేటిలో సీమాంధ్రకు చెందిన 12 మంది ఎంపీలు, 27 మంది ఎమ్యెల్యేలు, 15 మంది మంత్రులు, 10 మంది ఎమ్యెల్సీలు పాల్గొన్నారు. ఆజాద్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటి సుమారు గంటన్నర సేపు జరిగింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు