Saturday, July 23, 2011

శ్రీశైలం ప్రాజెక్టకు భారీగా వరద నీరు

శ్రీశైలం ,జులై 23:   ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  నీటిమట్టం 809 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 2.68 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 9,070 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా జూరాలకు వరద నీరు వచ్చి చేరటంతో అధికారులు  ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేశారు. 2,62,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల గరిష్ట నీటిమట్టం 318.56 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.2 మీటర్లగా ఉంది. నీటి విడుదల కారణంగా దిగువ ప్రంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...