తప్పుకున్న యడ్యూరప్ప

బెంగళూరు,జులై 28: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్ యడ్యూర ప్ప తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పంపించారు. పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా చేసినట్టు యడ్యూరప్ప ప్రకటించారు. తన నివాసంలో మద్దతుదారులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆషాడమాసం వెళ్లిపోయిన తర్వాత ఈ నెల 30న రాజీనామా లేఖను గరవ్నర్‌కు పంపాలని యడ్యూరప్ప నిర్ణయించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో యడ్యూరప్పను లోకాయుక్త తప్పుబట్టడంతో సీఎం సీటు నుంచి దిగిపోయాలని బీజేపీ అధినాయకత్వం ఆయన ను ఆదేశించింది. దక్షిణాదిన బీజేపీకి ఆశలు రేకిత్తించిన యడూర్యప్ప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాటినుంచి వివాదాలు, పదవీ గండాలు ఎదుర్కొన్నారు. అసమ్మతిని చవిచూశారు. ఆఖరికి అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఇరుక్కుని పదవి కోల్పోయారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు