Saturday, July 23, 2011

తేల్చాల్సింది సోనియానే...

కుండ బద్దలు కొట్టిన అజాద్...  
న్యూఢిల్లీ,జులై 23: తెలంగాణ అంశంపై అందరితో చర్చల తర్వాతే నిర్ణయమన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ మరో అడుగు ముందుకేసి.. తాను ఈ విషయంలో నిమిత్తమాత్రుడినేనని స్పష్టంచేశారు. ‘‘నా చేతిలో ఏమీ లేదు. నేను నిమిత్తమాత్రుడిని. నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. మీతో, వారితో (సీమాంధ్ర నేతలతో) చర్చలు జరిపి అన్నీ అధినేత్రికి నివేదిస్తాను. ఆ నివేదికపై పార్టీ అగ్రనేతలతో చర్చించి ఆమె నిర్ణయిస్తారు’’ అని అజ్జద్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తేల్చిచెప్పినట్లు తెలిసింది. అంతేకాదు, ‘‘మీరు నేను చేసిన సూచన పాటించకుండా పెద్ద సంఖ్యలో వస్తే చర్చలు జరపడం కష్టం. మరోసారి చెబుతున్నా. అయిదు నుంచి పదిమందితో చిన్న బృందంగా వస్తే అన్ని విషయాలూ సమగ్రంగా చర్చించడం కుదురుతుంది. అప్పటిదాకా చర్చల ప్రక్రియతో ముందుకెళ్లడం వీలు కాదు.  చిన్న బృందంగా రండి’’ అని ఆయన చెప్పినట్లు సమాచారం. సోమవారం రాత్రి 7 గంటలకు భేటీ అవుదామని వారికి సమయం కూడా ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా రెండోరోజు శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలోవచ్చి తనతో సమావేశమైనపుడు చివర్లో ఆజాద్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆయన ప్రతిపాదనకు అంగీకరించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సాధ్యమైనంత వరకు శనివారం.. లేదంటే ఆదివారం ప్రతినిధి బృందాన్ని ప్రకటిస్తామని అంటున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...