హైదరాబాద్,జులై 31: తెలంగాణ మంత్రులు విధులకు హాజరయ్యేది లేదని తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది మంత్రులు శనివారం సాయంత్రం రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సలహాను వారు తోసిపుచ్చారు. తెలంగాణకు చెందిన 12 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మరో నలుగురు గైర్హాజరయ్యారు. కె. జానా రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మా రెడ్డి, డికె అరుణ ముఖ్యమంత్రి తో సమావేశమయిన వారిలో వున్నారు. నలుగురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శంకరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్ని పార్టీల శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో, తెలంగాణ సమస్యపై పార్టీ అధిష్టానం చర్చలు ప్రారంభించిన నేపథ్యంలో విధులకు హాజరు కావాలని ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులకు సూచించారు. అయితే, అందుకు తెలంగాణ మంత్రులు అంగీకరించలేదు. ఉద్యమం తీవ్రమైన ప్రస్తుత తరుణంలో తాము విధులకు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీకి నష్టం జరుగుతుందని వారు చెప్పారు. తాము ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు విధులకు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఓ మంత్రి కచ్చితంగానే చెప్పినట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment