న్యూఢిల్లీ,జులై 21: క్లిష్టమైన తెలంగాణ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా.. ఆ ప్రాంతానికి విస్తృతాధికారాలు గల ‘ప్రాదేశిక అథారిటీ’ (టెరిటోరియల్ అథారిటీ)ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం లేనందున.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తూనే.. తాత్కాలిక పరిష్కారంగా మరింత ఆకర్షణీయమైన, మరింత హేతుబద్ధమైన ఏర్పాటుపై కసరత్తు చేసే బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించినట్లు తెలిసింది. ఆమేరకు తెలంగాణ ప్రాంతానికి ‘ప్రాదేశిక అథారిటీ’ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల బోగట్టా. ఈ ప్రాదేశిక అథారిటీ అధికారాల విషయంలో.. జమ్మూకాశ్మీర్కు గల ‘స్వయంప్రతిపత్తి’ కి కొంచెం తక్కువగాను, ఇటీవల గూర్ఖాలాండ్కు ప్రకటించిన ‘స్వయంపాలన’ కు కొంచెం ఎక్కువగాను ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం కాగలదని అని ఆ వర్గాలు అంటున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment