Wednesday, July 20, 2011

ఢిల్లీ పర్యటన పట్ల సీమాంధ్ర నేతల సంతృప్తి

న్యూఢిల్లీ,జులై 20:  సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు  న్యూఢిల్లీ పర్యటన పట్ల  హ్యాపీగా కనిపిస్తున్నారు.  ఢిల్లీ  నుండి హైదరాబాదుకు బయలుదేరే సమయంలో పలువురు సీమాంధ్ర నేతలు అధిష్టానం వైఖరి పట్ల సంతృప్తి వైఖరి చేశారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో అధిష్టానంపై తమకున్న  అపోహలు తొలగిపోయాయని చెప్పారు. సమైక్యాంధ్ర, తెలంగాణ విషయంలో అధిష్టానం ఇరు ప్రాంతాలకు అనుకూలమైన ప్రకటన త్వరలో చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 17న సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఎకె ఆంటోని తదితరులతో సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. తెలంగాణ విషయంలో వారికి సంతృప్తికరమైన సమాధానాలు అధిష్టానం నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు ఆల్ హ్యాపీస్ అన్న తరహాలో వెనుదిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆజాద్ తదితరుల  వ్యాఖ్యలు గమనించినా సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని అయితే రాష్ట్రం విడిపోవడం మాత్రం అసంభవమని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు  అన్నారు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు సహజమే అన్నారు.  చర్చలతో ముఠాకక్షదారులే కలిసి పోతుంటే ప్రాంతీయ విభేదాలు ఉన్న తాము కలవలేమా అని అన్నారు. ఒకరి విజయం మరొకరి వైఫల్యం కాదన్నారు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు సహజం అన్నారు. పరిష్కారం ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...