ఆరుగురు మంత్రులు, పది మంది శానససభ్యులు, నలుగురు శానససభ్యులు హాజరు
విజయవాడ,జులై 16: సమైక్యాంధ్ర కోసం విజయవాడలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆరుగురు మంత్రులు, పది మంది శానససభ్యులు, నలుగురు శానససభ్యులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అందించే ప్రతిపాదనలపై చర్చించడానికి కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శైలజానాథ్, కాసు వెంకటకృష్ణా రెడ్డి, పార్థసారథి, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి, పితాని హాజరయ్యారు. కాంగ్రెసు శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, రాజేష్, డిఎస్ దాసు, గాదె వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెసు ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, సింగం బసవపున్నయ్య, రాయపాటి శ్రీనివాస్, ఐలా వెంకయ్య సమావేశానికి వచ్చారు. 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ తులసిరెడ్డి కూడా వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎవరూ ఈ సమావేశానికి రాలేదు. ఉత్తరాంధ్రలో గత కొద్ది రోజులుగా ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం జరుగుతోంది. పైగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఉత్తరాంధ్రకు చెందినవారే. నెల్లూరు జిల్లా నుంచి సమావేశానికి ఎవరూ రాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment