హైదరాబాద్,జులై 14: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు చేపట్టిన 48 గంటల దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని 12 గంటలు ముందుగానే దీక్షలను విరమిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి వారి చేత దీక్ష విరమింపజేశారు.
విద్యార్ధులు కూడా...
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులు కూడా దీక్షలు విరమించారు. దీక్షలు విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పటికే విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దీక్షలు విరమించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థులను కోరారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, విరసం నేత వరవరరావు, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, వివేక్ వారి చేత దీక్షలు విరమింపజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment