Wednesday, July 13, 2011
మూడు వరుస పేలుళ్ళతో ఉలిక్కిపడిన ముంబై
ముంబై,జులై 13: : ముంబై నగరం లో బుధవారం సాయంత్రం మూడు చోట్ల వరుస పేలుళ్లు సంభవించాయి. నలుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 11 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదర్, జవేరీ బజార్, ఒపేరా హౌస్ ప్రాంతాలలో ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు సంబంధించి పోలీస్ కంట్రోల్ రూంకు ముందుగానే ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. దాదర్ వద్ద నిలిపి ఉన్నకారులో బాంబు పేలింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముంబైలో గతంలో భారీ పేలుళ్లు సంభవించి ఈ నెల 11వ తేదీ నాటికి అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రేలుళ్ళలతో దేశంలోని ప్రధాన నగరాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment