Thursday, July 14, 2011
రెండు వారాల్లో తెలంగాణ పై ప్రకటన: కెసిఆర్ ధీమా
హైదరాబాద్,జులై 14: రెండు వారాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు కండువా వేసుకుని గురువారం కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల దీక్షా శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రెండు వారాల్లో తెలంగాణ పై ప్రకటన వెలువడుతుందని తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని ఆయన చెప్పారు. ధర్మమే గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాలను, దీక్షను ఆయన కొనియాడారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment