Monday, July 11, 2011

తెలంగాణపై మూడు ఆప్షన్స్...

న్యూఢిల్లీ,జులై 11:  తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం మూడు రకాల పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నదని,  ఒకటి ఏడాదిలోగా తెలంగాణ ప్రక్రియని పూర్తి చేయడం, రెండు- హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం, మూడు- రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేయడమని   ఆయన విలేకరులకు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్­ రాష్ట్రంలో ఏవిధమైన రాజకీయ అనిశ్చితి లేదని ఆయన చెప్పారు.  కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణపై ఒక ప్రకటన వెలువడుతుందని సింఘ్వీ చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...