Monday, July 11, 2011
తెలంగాణపై మూడు ఆప్షన్స్...
న్యూఢిల్లీ,జులై 11: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం మూడు రకాల పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నదని, ఒకటి ఏడాదిలోగా తెలంగాణ ప్రక్రియని పూర్తి చేయడం, రెండు- హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం, మూడు- రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేయడమని ఆయన విలేకరులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవిధమైన రాజకీయ అనిశ్చితి లేదని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణపై ఒక ప్రకటన వెలువడుతుందని సింఘ్వీ చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment