తెలంగాణపై మూడు ఆప్షన్స్...
న్యూఢిల్లీ,జులై 11: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం మూడు రకాల పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నదని, ఒకటి ఏడాదిలోగా తెలంగాణ ప్రక్రియని పూర్తి చేయడం, రెండు- హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం, మూడు- రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేయడమని ఆయన విలేకరులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవిధమైన రాజకీయ అనిశ్చితి లేదని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణపై ఒక ప్రకటన వెలువడుతుందని సింఘ్వీ చెప్పారు.
Comments