తెలంగాణపై మూడు ఆప్షన్స్...

న్యూఢిల్లీ,జులై 11:  తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం మూడు రకాల పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నదని,  ఒకటి ఏడాదిలోగా తెలంగాణ ప్రక్రియని పూర్తి చేయడం, రెండు- హైదరాబాద్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం, మూడు- రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేయడమని   ఆయన విలేకరులకు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్­ రాష్ట్రంలో ఏవిధమైన రాజకీయ అనిశ్చితి లేదని ఆయన చెప్పారు.  కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణపై ఒక ప్రకటన వెలువడుతుందని సింఘ్వీ చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు