న్యూఢిల్లీ,జులై 31: ఏడాదికి పైగా లోక్సభ ఆమోదం కోసం వేచిచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తెలిపారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలతో పలు దఫాలుగా చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా, మంగోలియాల్లో వారం రోజుల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి శనివారం భారత్ తిరిగి వస్తూ ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. మంగోలియాలో మహిళా ఎంపీలతో జరిపిన సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగిందని చెప్పారు. ‘పార్లమెంటులో మహిళలకు కోటా ఉండాలని వారు కూడా కోరుకుంటున్నారని , భారత్లో మహిళా బిల్లు త్వరగా ఆమోదం పొందితే.. అలాంటి బిల్లు తేవాల్సిందిగా తాము కూడా మంగోలియా ప్రభుత్వాన్ని కోరతామని వారు చెప్పారని పాటిల్ వివరించారు. మహిళా బిల్లు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment