Friday, July 8, 2011

స్వర్ణయుగం తెస్తా: జగన్

కడప,జులై 8: వైఎస్‌ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఇడుపులపాయలో ప్రారంభం అయ్యాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ప్రజా ప్రస్థానం వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి  సంచలన రీతిలో పార్టీ విధివిధానాలను, నూతన పథకాలను ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా చూడని పేదరికాన్ని తాను చూశానన్నారు. ఓదార్పు యాత్రలో అనేక మారుమూల ప్రాంతాలు పర్యటించి పేదరికాన్ని దగ్గరగా చూసి, పేదల బతులకులను, వారి బాధలను పరిశీలించానన్నారు. వారి బాధలను తీర్చడానికి మహొన్నతమైన రీతిలో పథకాలను రూపొందించినట్లు తెలిపారు. పథకాల వివరాలు....పథకాలలో కొన్నింటిని ఈ దిగువ ఇస్తున్నాం.1. రాష్ట్రంలో తొలిసారిగా రైతు బడ్జెట్ ప్రవేశం2. రైతులకు వడ్డీలేని రుణాలు. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.3. మహిళలకు వడ్డీలేని రుణాలు. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.4. వైఎస్ఆర్ అమ్మ ఒడి పథకం : ఈ పథకం కింద తన పిల్లలను బడికి పంపించేందుకు ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్­లో 500 రూపాయలు జమ చేస్తారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తారు. పిల్లలు ఇంటర్­లోకి వచ్చేసరికి దానికి 750 రూపాయలకు పెంచుతారు. డిగ్రీలోకి వచ్చిన తరువాత వెయ్యి రూపాయలకు పెంచుతారు.5. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పెంపు.6. ఏడాదికి పది లక్షల ఇళ్ల నిర్మాణం7. ప్రతి రైతు కూలీ కుటుంబానికి ఒక ఎకరా భూమి పంపిణీ8. రైతులకు వ్యవసాయంలో సలహాల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలతో 103 వాహనాలు9. పశువులకు, మేకలకు వైద్యం కోసం వెటర్నరీ డాక్టర్లతో 102 వాహనాలు.10. ప్రతి మండలానికి ఒక 104 వాహనం11. రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచడం.12. రైతులకు మద్దతు ధర కోసం ప్రత్యేక నిధి13. ఆరోగ్యశ్రీ పథకం మెరుగుపరచడం.
 ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వివరాలు :
ఎమ్మెల్యేలు : కొండా సురేఖ, శివప్రసాద్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, ఆదినారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ధర్మాస కృష్ణదాసు, శోభా నాగిరెడ్డి, శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బాలరాజు, కొర్ల భారతి, ప్రసాదరాజు, గొల్ల బాబురావు, కుంజా సత్యవతి ఎమ్మెల్సీలు : పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకా శేషుబాబు, దేవగూడి నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, జూపూడి ప్రభాకర్.ఎంపీలు : మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...