రాజీనామాలకు చలించని కేంద్రం

' చర్చల '  పాటే పాడిన పెద్దలు  
న్యూఢిల్లీ,జులై 6:  తెలంగాణా పై 12 మంది మంత్రులతోపాటు వంద మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపిలు రాజీనామా చేసినా కేంద్రంలో చలనంలేదు.  మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంతో ఆశతో ఢిల్లీ వచ్చిన తెలంగాణ మంత్రులకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఏమీ లభించలేదు. దాంతో వారిలో కొందరు  తిరుగుప్రయాణం అవుతున్నారు. మరి కొందరు గురువారం  బయలుదేరతారు. తెలంగాణ నేతల డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. మంత్రులతో ఉదయం సమావేశమైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్­ఛార్జి గులాం నబీ అజాద్  ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు. మరోవైపు కేంద్ర మంత్రి చిదంబరం సంప్రదింపులు కొనసాగుతాయని మాత్రమే చెప్పారు. దాంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  మరికొంత సమయం ఎదురు చూస్తామని  కొందరు ఎంపిలు చెప్పారు.
సంప్రదింపులతోనే నిర్ణయం:  చిదంబరం
 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి కేంద్రం ఆలోచించటం లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ప్రక్రియతోనే తెలంగాణపై సమస్యపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన  విలేకర్ల సమావేశంలో అన్నారు.ఇందులో భాగంగానే తెలంగాణ ప్రాంత నేతలతో ఆరాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ చర్చలు జరుపుతున్నారన్నారు. రాష్ట్రంలో బంద్‌లు, ఆందోళనలు ఉన్నందున కేంద్ర బలగాలను తరలించినట్లు చిదంబరం తెలిపారు.  ఏపీలో స్వల్ప సంఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చిదంబరం పేర్కొన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు