నాగం వర్గం రాజీనామా

హైదరాబాద్,జులై 3: తెలంగాణ కోసం పోరాడే వారిమథ్య ఐక్యతను కోరుతూ  ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల దీక్షను  చేపట్టిన ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి తో పాటు ఆయనకు  మద్దతు తెలిపిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు జనార్ధన రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలు రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. ఆ లేఖలను శాసనసభ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్కకు పంపారు.ఇందిరా పార్కు వద్ద ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆదివారం  ఉదయం 10 గంటలకు ఐక్యత దీక్షను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ,  మాజీ మంత్రి బోడ జనార్ధన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, విమలక్క, వసంత రెడ్డి పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు