హైదరాబాద్,జులై 3: తెలంగాణ కోసం పోరాడే వారిమథ్య ఐక్యతను కోరుతూ ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల దీక్షను చేపట్టిన ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి తో పాటు ఆయనకు మద్దతు తెలిపిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు జనార్ధన రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి, హరీశ్వర రెడ్డి, జోగు రామన్నలు రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. ఆ లేఖలను శాసనసభ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్కకు పంపారు.ఇందిరా పార్కు వద్ద ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు ఐక్యత దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి బోడ జనార్ధన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, విమలక్క, వసంత రెడ్డి పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment