హైదరాబాద్,జులై 2: : రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గవర్నర్ నరసింహన్ బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రతిభాపాటిల్ వారం రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులతో ముఖాముఖి జరుపుతారు. 5న హైదరాబాద్లోని భారత డైనమిక్స్ లిమిటెడ్ను సందర్శిస్తారు. 6వ తేదీ సాయంత్రం తిరుపతి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన మహిళా సాధికారిత కార్యక్రమంలో పాల్గొంటారు. 7వ తేదీన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు తిరుమలలో నూతనంగా నిర్మించిన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. సాయంత్రం అక్కడ్నుంచి ముంబాయి వెడతారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment