Friday, July 1, 2011

కాంగ్రెసోళ్ళు రాజినామాలు చేస్తారట...చూద్దాం...!

హైదరాబాద్,జులై 1 : తెలంగాణాపై అథిష్టానం  నాన్పుడు ధోరణి, ఇటు టి.ఆర్.ఎస్. నుంచి ఒత్తిడి మథ్య రాజినామాలకే సిద్ధపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలు నేరుగా స్పీకర్ కు  సమర్పించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు   నిర్ణయం తీసుకున్నారు.  శుక్రవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల  సమావేశం అనంతరం  మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ, డిసెంబరు 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  ఎంపిలు లోక్ సభ క్­సభ స్పీకర్ కు  తమ రాజీనామాలు సమర్పిస్తారని ఎం.పి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ స్పీకర్ కు  రాజీనామాలు సమర్పిస్తారని చెప్పారు.
తొందరపడవద్దు: ఆజాద్
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత తేలికేం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్­ఛార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ అంశం ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందని, నాయకులు ఎవరూ తొందరపడవద్దని  గులాం నబీ ఆజాద్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సలహా ఇచ్చారు. తెలంగాణ విషయంలో రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని,  రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపవలసి ఉందని ఆయన చెప్పారు.  ఇదిలా ఉండగా, ఆజాద్­ హైదరాబాద్ లోనే  ఉన్నా ఆయనతో చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపలేదు.
రాజీనామాలు మార్గం కాదు: ఎఐసిసి
తెలంగాణ సమస్య జటిలమైనదని ఎఐసిసి కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాజీనామాలు మార్గం కాదని ఆయన హితవు పలికారు. అందరితో చర్చించి అధిష్టానం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు.
టిడిపి ఎమ్మెల్యేలు కూడా సిద్ధం: ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతల రాజీనామా ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. వారికంటే ముందే తాము రాజీనామా చేస్తామని చెప్పారు. ఈ విషయం చర్చించడానికి తమ పార్టీ నేతలు ఈ నెల 4న సమావేశం కానున్నట్లు తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...