నార్వేలో ఉగ్రవాదుల దాడి: 87మంది మృతి

ఓస్లో,జులై 23:  నార్వే రాజధాని ఓస్లోలోని ప్రధానమంత్రి కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు ఓ దీవిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటనల్లో 87మంది దుర్మరణం పాలయ్యారు. బాంబు దాడిలో ఏడుగురు మృతి చెందగా, ఓటోయ ద్వీపంలో జరుగుతున్న యువజన సమ్మేళనంపై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో  సుమారు 80మంది మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు.  ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు