నార్వేలో ఉగ్రవాదుల దాడి: 87మంది మృతి
ఓస్లో,జులై 23: నార్వే రాజధాని ఓస్లోలోని ప్రధానమంత్రి కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు ఓ దీవిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటనల్లో 87మంది దుర్మరణం పాలయ్యారు. బాంబు దాడిలో ఏడుగురు మృతి చెందగా, ఓటోయ ద్వీపంలో జరుగుతున్న యువజన సమ్మేళనంపై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో సుమారు 80మంది మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Comments