Friday, July 8, 2011
14న కేంద్ర మంత్రివర్గ విస్తరణ...?
న్యుఢిల్లీ,జులై 8: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ నెల 14వ తేదీన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిఎంకెకు చెందిన ఎ రాజా, దయానిధి మారన్ రాజీనామాలతో, రైల్వే మంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వెళ్లడంతో మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మరికొంత మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రధాని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆంద్రప్రదేశ్ నుంచి సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, తెలంగాణకు చెందిన సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ మంత్రివర్గంలో చోటు కోసం రేసులో ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన 11 మంది లోకసభ సభ్యుల్లో 9 మంది రాజీనామా చేశారు. సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ మాత్రమే రాజీనామాలకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు రాజీనామా చేసిన నేపథ్యంలో హనుమంత రావుకు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ అంశంపై తీవ్రమైన వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రి వర్గంలో ఎవరికీ చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే మాత్రం కావూరికి చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. డిఎంకె నుంచి మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా జరుగుతోంది. దయానిధి మారన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పోటీ తీవ్రమైంది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే, డిఎంకె నుంచి కొత్తగా మంత్రివర్గంలో ఎవరూ చేరకపోవచ్చునని భావిస్తున్నారు. రైల్వే మంత్రి మమతా బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడికే ఆ పదవి దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రెసుకు చెందిన కొంత మందికి కూడా మంత్రివర్గంల స్థానం లభించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు రాజీనామా చేసిన నేపథ్యంలో హనుమంత రావుకు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment