హైదరాబాద్,జులై 23: హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గచ్చిబౌలిలో 12 ఎకరాలను లీజుకిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ స్థల కేటాయింపు జరిగింది. తాజాగా శుక్రవారం ఈ స్థలాన్ని లీజుకిచ్చేందుకు సచివాలయంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్ సమక్షంలో అమెరికా కాన్సులర్ జనరల్ కేథరిన్ ధనాని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) డెరైక్టర్ బి.ఆర్. మీనా, సాధారణ పరిపానల శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ఆర్.ఎం. గోనెల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం బేగంపేటలోని పైగా ప్యాలెస్లో అమెరికా కాన్సులేట్ కార్యాలయం కొనసాగుతోంది. గచ్చిబౌలిలో నిర్మించనున్న కార్యాలయం దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment