Friday, July 15, 2011
విజయవంతంగా జిశాట్ -12 ప్రయోగం
నెల్లూరు,జులై 15: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటనుంచి శుక్రవారం సాయంత్రం 4.48 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సి 17 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్-12ను ఇది నింగిలోకి మోసుకెళ్లింది. జీశాట్-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. రూ. 200 కోట్లతో ఈ ప్రయోగాన్ని షార్ చేపట్టింది. జీశాట్ -12 నిర్దిష్ట కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రజ్ఞుల్లో ఆనందం అంబరాన్ని అంటింది. జిశాట్ -12 ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ఈ ఉపగ్రహాన్ని విద్య, టెలిఫోన్, టెలిమెడిసిన్ సర్వీసులకు వినియోగిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment