Friday, July 15, 2011

విజయవంతంగా జిశాట్ -12 ప్రయోగం

నెల్లూరు,జులై 15:   భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటనుంచి  శుక్రవారం సాయంత్రం 4.48 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి 17 రాకెట్‌ను  విజయవంతంగా ప్రయోగించింది. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్‌-12ను ఇది నింగిలోకి మోసుకెళ్లింది.  జీశాట్‌-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. రూ. 200 కోట్లతో ఈ ప్రయోగాన్ని షార్‌ చేపట్టింది. జీశాట్ -12 నిర్దిష్ట కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రజ్ఞుల్లో ఆనందం అంబరాన్ని అంటింది. జిశాట్ -12 ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.  ఈ ఉపగ్రహాన్ని విద్య, టెలిఫోన్, టెలిమెడిసిన్ సర్వీసులకు వినియోగిస్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...