వీనస్,నాదల్ శుభారంభం

వింబుల్డన్, జూన్ 21: గాయాల కారణంగా ఇటీవల ఎక్కువ కాలం విశ్రాంతికే పరిమితమైన ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ సోమవారం ఇక్కడ అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈమె ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణి అగ్‌కుల్ అమాన్మురడొవాను 6-3, 6-1 తేడాతో చిత్తుచేసింది.  కాగా, పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తన ప్రత్యర్థి మైకెల్ రసెల్‌పై 6-4, 6-2, 6-3 తేడాతో సునాయాంగా గెలిచాడు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు