Tuesday, June 21, 2011

వీనస్,నాదల్ శుభారంభం

వింబుల్డన్, జూన్ 21: గాయాల కారణంగా ఇటీవల ఎక్కువ కాలం విశ్రాంతికే పరిమితమైన ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ సోమవారం ఇక్కడ అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఈమె ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణి అగ్‌కుల్ అమాన్మురడొవాను 6-3, 6-1 తేడాతో చిత్తుచేసింది.  కాగా, పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తన ప్రత్యర్థి మైకెల్ రసెల్‌పై 6-4, 6-2, 6-3 తేడాతో సునాయాంగా గెలిచాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...