Wednesday, June 15, 2011

మేమెరుగ...మేమెరుగ ...మేడం నడుగుదాం...!

న్యూఢిల్లీ, జూన్ 15: : తెలంగాణాపై తేల్చుకోవడానికి ఇదే చివరి పర్యటన అంటూ హస్తిన కు వెళ్ళిన కాంగ్రెస్ తెలంగాణా ప్రాంత ప్రతినిధులకు  కోర్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు  చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ల నుంచి స్పష్టమైన హామీ యేదీ లభించలేదు. ఆల్ పార్టీ మీట్ జరిగితేనే ఏదైనా చెప్పగలమని , లేకుంటే మేడం దే తుది నిర్ణయమని  పెద్దలిద్దరూ తేల్చేశారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 55 మంది తెలంగాణ ప్రజాప్రతినిధులు మొదట చిదంబరం తోనూ, తర్వాత ప్రణబ్  తోనూ సమావేశమయ్యారు. చిదంబరం మాట్లాడుతూ ఈ విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అన్ని పార్టీలతో సమావేశం ముగిసిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పైగా సీనియర్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పై వత్తిడి తేవాలని తెలంగాణ నేతలకు చిదంబరం సూచన చేశారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ అధిష్టాన వర్గం సలహా పైనే తాను లోగడ తెలంగణా పై ప్రకటనలు చేశానని,  తనకు తానుగా నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని చిదంబరం తేల్చి చెప్పారు. ఇక ప్రణబ్ ముఖర్జీ  ప్రస్తుతం పర్యటనలో వున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి దేశ రాజధానికి చేరుకున్న తర్వాత తెలంగాణ ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేస్తామని తెలంగాణ ప్రాంత నాయకులకు  హమీ ఇచ్చినట్టు తెలిసింది. వీరిద్దరితో సమావేశం తర్వాత తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్యెల్యేలు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సానుకూల ప్రకటన రాకపోతే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని తెలంగాణా ప్రజా ప్రతినిధులు మీడియాతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తమ వాదనను ప్రణబ్ అర్ధం చేసుకున్నారన్నారు.  త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రణబ్ వెల్లడించినట్టు తెలంగాణ నాయకులు తెలిపారు.      

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...