రాజీనామాలను సిద్ధం చేసుకుంటున్న తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు

న్యూఢిల్లీ ,జూన్ 16:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ కార్యాచరణను ఉధృతం చేశారు.  శానససభ్యుల రాజీనామా లేఖలను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె. జానారెడ్డి సేకరిస్తుండగా, పార్లమెంటు సభ్యుల రాజీనామా లేఖలను పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 22 మంది తెలంగాణ శాసనసభ్యులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు, 12 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు పార్లమెంటు సభ్యులు తమ తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. జులై 1వ తేదీ తర్వాత తమ రాజీనామా లేఖల కార్యాచరణను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి డెడ్‌లైన్ పెట్టారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి నిరాహార దీక్షకు దిగాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు