న్యూఢిల్లీ ,జూన్ 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ కార్యాచరణను ఉధృతం చేశారు. శానససభ్యుల రాజీనామా లేఖలను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె. జానారెడ్డి సేకరిస్తుండగా, పార్లమెంటు సభ్యుల రాజీనామా లేఖలను పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 22 మంది తెలంగాణ శాసనసభ్యులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు, 12 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు పార్లమెంటు సభ్యులు తమ తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. జులై 1వ తేదీ తర్వాత తమ రాజీనామా లేఖల కార్యాచరణను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి డెడ్లైన్ పెట్టారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి నిరాహార దీక్షకు దిగాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment