Thursday, June 9, 2011

తెలంగాణా జె.ఎ.సి. కొత్త డెడ్ లైన్

హైదరాబాద్,జూన్ 9:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల రాజీనామాలకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈనెల 25 ను  డెడ్‌లైన్ గా విధించింది. ఈనెల 25 లోపు తెలంగాణపై తేల్చకుంటే ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ సమస్య క్లిష్టమైనదనటం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే క్లిష్టమంటే ఏమిటో తాము చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 19న హైదరాబాద్‌లో రోడ్లుపై వంటావార్పులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...