Thursday, June 2, 2011

తెలంగాణ పై అధిష్టానానికి కాంగ్రెస్ ఎంపీల డెడ్‌లైన్

హైదరాబాద్, ,జూన్ 2 : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి మరోసారి డెడ్‌లైన్ విధించారు. తెలంగాణ ఏర్పాటుపై  10 రోజుల్లోగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జూలై 1 నుంచి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని, ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కె.కేశవరావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, మధుయాష్కీ, జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్‌లు సమావేశమయ్యారు.  హైకమాండ్ నాన్చుడు ధోరణిని అవలంబించడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎంపీ పదవుల్లో కొనసాగడం దండగనే అభిప్రాయం వ్యక్తమైంది. త్వరలోనే హైకమాండ్ పెద్దలను కలసి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసేలా ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని నిర్ణయించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...