Sunday, June 12, 2011

వన్డే సిరీస్ భారత్‌ కైవశం

ఆంటిగ్వా,జూన్ 12:    వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే లో భారత్  3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది. విండీస్‌ విధించిన 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 46.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 86(91 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పటేల్‌ 46, హర్భజన్‌ 41, ప్రవీణ్‌కుమార్‌ 25, బద్రీనాథ్‌ 11, ధావన్‌ 4, రైనా 3 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో సమీ, బిషూ రెండేసీ, రస్సెల్‌, పోలార్డ్ తలో వికెట్‌ తీశారు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 92 పరుగులు చేసిన  విండీస్‌ బ్యాట్స్‌మన్‌ రస్సెల్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...