వన్డే సిరీస్ భారత్‌ కైవశం

ఆంటిగ్వా,జూన్ 12:    వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే లో భారత్  3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది. విండీస్‌ విధించిన 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 46.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 86(91 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పటేల్‌ 46, హర్భజన్‌ 41, ప్రవీణ్‌కుమార్‌ 25, బద్రీనాథ్‌ 11, ధావన్‌ 4, రైనా 3 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో సమీ, బిషూ రెండేసీ, రస్సెల్‌, పోలార్డ్ తలో వికెట్‌ తీశారు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 92 పరుగులు చేసిన  విండీస్‌ బ్యాట్స్‌మన్‌ రస్సెల్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు