హైదరాబాద్ ,జూన్ 12: తెలంగాణపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులైలో జరిగే పార్లమెంటు సమావేశాలను ఆయన వేదికగా మార్చుకునే అవకాశాలున్నాయి. రాజీనామాలకు తెలంగాణ జెఎసి జూన్ 25వ తేదీ డెడ్లైన్ విధించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు రాజీనామాలకు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థితిలో తెలంగాణ కోసం రాజీనామా చేసే దమ్ము వారికి లేదని ధ్వజమెత్తుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కేసీఆర్ రాజీనామాకు సిద్ధపడతారని సమాచారం. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన కేసీఆర్ మరోసారి రాజీనామా చేయడం ద్వారా తెలంగాణపై తమకే చిత్తశుద్ధి ఉందని ప్రచారం చేసుకోవడం ఈ వ్యూహం వెనుక ఉద్దేశం గా కనబడుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment