Thursday, June 9, 2011

ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రధాని, పలువురు కేంద్ర మంత్ర్రులు

న్యూఢిల్లీ,జూన్ 9:   ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు గురువారం తమ ఆస్తులు వివరాలు వెల్లడించారు. ప్రధాని, పలువురు కెంద్ర మంత్ర్రులు  తమ ఆస్తులను ప్రకటించారు. ఆస్తుల వివరాలు : రూ. 2.7 కోట్ల ఫిక్సెడ్  డిపాజిట్లు, రూ.90 లక్షలు, రూ.88 లక్షలు విలువ చేసే రెండు ఇళ్లు ఉన్నట్లు ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. హోంమంత్రి చిదంబరం రూ.1.4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. రూ.1.1 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, రూ.10 కోట్ల 6 లక్షలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రూ.22కోట్ల 25 లక్షలు ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...