తెలంగాణ సమస్యను త్వరగా తేల్చలేం: గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ,జూన్ 6: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్  తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమస్య చాలా సంక్లిష్టమైందని, అంత త్వరగా తేలేది కాదని ఆయన సోమవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. ఇరు ప్రాంతాల ఎంపీలతో చర్చిస్తున్నామన్నారు. తెలంగాణపై అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని పార్టీ ప్రజాప్రతినిధులు హెచ్చరించడాన్ని ప్రస్తావించగా వారిని సముదాయిస్తున్నామని, ఎప్పటికప్పుడు వారికి సర్ది చెబుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్రను, తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారని, ఇటువంటి స్థితిలో సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదని ఆయన అన్నారు. ప్రజలు యువనాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశామని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులున్న మాట వాస్తవమేనని, వాటిని కిరణ్ కుమార్ రెడ్డి అధిగమించగలరని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే విషయంపై ఆలోచన చేయలేదని ఆయన చెప్పారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు