Saturday, June 18, 2011

అడుక్కుంటే తెలంగాణా వస్తదా...

హైదరాబాద్ , జూన్ 18:   తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు న్యూఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని బిచ్చమెత్తుకున్నట్టు అడిగితే ప్రత్యేక రాష్ట్రం రాదని టి-కాంగ్రెసు నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు  సూచించారు. ఆంధ్ర వారి పాలనలో ఉన్నన్నాళ్లు మన పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. అంధ్రాలో నేతలంతా ఒక్కటై తెలంగాణ అడ్డుకుంటున్నారని, అలాగే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్కటై తెలంగాణ సాధించాలని సూచించారు. రాజీనామాలు చేయడం చేతకాని నేతలు ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలు అర్పిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజక్టుల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శిలాఫలకాలు వేస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మొక్కలు నాటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...