సోనియాకు అమలాపురం ఎం.పి. లేఖాస్త్రం
న్యూఢిల్లీ, జూన్ 14: పిసిసి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన బొత్స సత్యనారాయణకు తొలి షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా అమలాపురం పార్లమెంటు సభ్యుడు జి.వి.హర్షకుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించారు. అత్యంత అవినీతిపరుడైన బొత్సను పీసీసీ అధ్యక్షుణ్ని చేయడం పార్టీకి ఏమాత్రం మేలు కాదంటూ లేఖలో పేర్కొన్నారు. బొత్స రాజకీయ జీవింతమంతా వివాదాస్పదమేనని, తప్పుడు దారుల్లో భారీగా డబ్బు గడించారని శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు మద్యం సిండికేట్తో కుమ్మక్కయ్యారని , కృష్ణా-గోదావరి బేసిన్లో ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, సీబీఐ నిష్కళంకుడని చెప్పినా వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో బొత్స చేయి ఉందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు జిల్లాలో భూకబ్జాకోరులుగా పేరుందని ఆరోపించారు. కోస్తా జిల్లాల్లో సాధారణంగా కాపులు-దళితులకు మధ్య సత్సంబంధాలు లేవని, బొత్స మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని,బొత్స సత్యనారాయణ కేవీపీ మద్దతుదారుడు కూడా నని , కాపు, తూర్పుకాపు, మున్నూరు కాపులంతా ఒక్కటేనని, పీసీసీ అధ్యక్షస్థానం ఎప్పుడూ వీరికే ఇస్తూ పోతే కాంగ్రెస్కు సంప్రదాయ ఓటుబ్యాంక్ అయిన దళితులు జగన్వైపు వెళ్లే ప్రమాదముందని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 14: పిసిసి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన బొత్స సత్యనారాయణకు తొలి షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా అమలాపురం పార్లమెంటు సభ్యుడు జి.వి.హర్షకుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించారు. అత్యంత అవినీతిపరుడైన బొత్సను పీసీసీ అధ్యక్షుణ్ని చేయడం పార్టీకి ఏమాత్రం మేలు కాదంటూ లేఖలో పేర్కొన్నారు. బొత్స రాజకీయ జీవింతమంతా వివాదాస్పదమేనని, తప్పుడు దారుల్లో భారీగా డబ్బు గడించారని శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు మద్యం సిండికేట్తో కుమ్మక్కయ్యారని , కృష్ణా-గోదావరి బేసిన్లో ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, సీబీఐ నిష్కళంకుడని చెప్పినా వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో బొత్స చేయి ఉందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులకు జిల్లాలో భూకబ్జాకోరులుగా పేరుందని ఆరోపించారు. కోస్తా జిల్లాల్లో సాధారణంగా కాపులు-దళితులకు మధ్య సత్సంబంధాలు లేవని, బొత్స మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని,బొత్స సత్యనారాయణ కేవీపీ మద్దతుదారుడు కూడా నని , కాపు, తూర్పుకాపు, మున్నూరు కాపులంతా ఒక్కటేనని, పీసీసీ అధ్యక్షస్థానం ఎప్పుడూ వీరికే ఇస్తూ పోతే కాంగ్రెస్కు సంప్రదాయ ఓటుబ్యాంక్ అయిన దళితులు జగన్వైపు వెళ్లే ప్రమాదముందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment