Friday, June 17, 2011

కుప్పలు తెప్పలు గా నగదు,నగలు ...!

యజుర్వేదమందిరం లో 
బాబా సంపద 
పుట్టపర్తి,జూన్, 17: ప్రశాంతి నిలయం యజుర్వేద మందిరం పెద్ద ధనాగారాన్నే తలపిస్తోంది.  ఇందులో దేశవిదేశీ కరెన్సీతోపాటు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయి. నగదు 11 కోట్ల 56 లక్షల రూపాయలు ఉన్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. 98 కిలోల  బంగారు ఆభరణాలు, 307 కిలోల వెండి ఉన్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. మందిరాన్ని తెరిచే సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల కూడా ఉన్నట్లు తెలిపింది. బాబా వీలునామా ఏదీలేదని ట్రస్ట్ ప్రకటించింది. నగదు మొత్తాన్ని స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ తెలిపారు.  ఈ మందిరాన్ని గురువారం వుదయం  తెరిచి నగదు, ఆభరణాలను  36 గంటల పాటు లెక్కించారు. బంగారు ఆభరణాలను కూడా బ్యాంకు లాకర్­లో ఉంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మందిరంలో దేవతా మూర్తుల 5 బంగారు విగ్రహాలు, సౌదీ రాజు బహూకరించిన వజ్రాలు ఉన్నట్లు సమాచారం. అమూల్యమైన వజ్ర వైఢూర్యాలతోపాటు విదేశీ కరెన్సీ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పెద్ద బ్యాంకునే నిర్వహించినట్లు తెలుస్తోంది. మందిరంలోని బాబా గది నిండా విలువైన వస్తువులు ఉన్నాయి. నగదు, నగలు కుప్పలుగా పడవేసి ఉన్నాయి. జూలై 15 నుంచి యజుర్వేద మందిరంలోకి భక్తులను అనుమతిస్తామని బాబా ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ చెప్పారు. జూలై 10 లోపల సమాధి నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్నారు. బాబా సమాధి వద్ద బంగారు విగ్రహం పెట్టాలన్న ఆలోచనలేదని చెప్పారు. త్వరలో బాబాకు చెందిన ముఖ్యమైన వస్తువులతో ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తామన్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...