Wednesday, June 22, 2011

రికార్డు కోసం ఇంత బరితెగింపా...!

లండన్,జూన్ 22: ఏకంగా నాలుగు వందల మంది స్త్రీ, పురుషులు 'వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్' రికార్డు కోసం ప్రపంచం నలుమూలల నుంచి సౌత్ వేల్స్ చేరుకొని గౌవెర్ రోస్సీలీ బీచ్‌లో వంటి మీద నూలు పోగు లేకుండా సముద్రపు నీటిలో సమూహిక స్నానాలు చేశారు. గతంలో 250 స్త్రీ, పురుషులు నెలకొల్పిన పాత స్కిన్నీ డిప్పింగ్ రికార్డును వీరు బద్దలుకొట్టారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వీరంతా బట్టలు విప్పేసి జిల్ మనే సముద్రపు నీటిలో చిల్ అయ్యారు. ఈ రికార్డులో పాల్గొన్న ఓ స్కిన్నీ డిప్పర్ లిజ్జీ వైట్ మాట్లాడుతూ.. తాను ఆస్ట్రేలియా నుంచి వయా బ్రెజిల్ ద్వారా ఈ రికార్డులో పాల్గొనేందుకు సౌత్ వేల్స్ చేరుకున్నానని, ఇది తనకు థ్రిల్లింగ్‌గా వుందని చెప్పారు. హవ్వ...మరీ రికార్డు కోసం ఇంత బరితెగింపా...!

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...