Tuesday, June 21, 2011

భారతీయ అమెరికన్ వైద్య దంపతుల దుర్మరణం

వాషింగ్టన్,జూన్ 21: : అమెరికాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ అమెరికన్ వైద్య దంపతులు దుర్మరణం చెందారు. న్యూజెర్సీలోని ఫ్రాంక్లిన్ లేక్స్ లో నివసించే డాక్టర్ విశ్వనాథన్ రాజారామన్ (54) నాడీశాస్త్ర నిపుణులుగా, ఆయన భార్య డాక్టర్ మేరీ జె. సుందరం (50) ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వాషింగ్టన్‌లో ఉండే తమ కూతురు కావ్య విశ్వనాథన్‌ను కలిసిన వారిద్దరూ... శుక్రవారం సాయంత్రం కొలంబస్‌కు చేరుకున్నారు. ఆదివారం...రికెన్‌బేకర్ ఎయిర్‌పోర్ట్ లో వారు ప్రయాణిస్తున్న సిర్రస్ సీఆర్22 విమానంలో ఇంధనాన్ని నింపుకున్న అనంతరం టేకాఫ్ తీసుకున్నారు. కాగా కొద్దిసేపటికే ఒహాయోలోని మొక్కజొన్న తోటలో విమానం కూలిపోయి మంటలు చెలరేగాయనీ, ఈ దుర్ఘటనలో వైద్య దంపతులిద్దరూ చనిపోయారని ఒహాయో రాష్ట్ర హైవే పోలీసులు తెలిపారు.రాజారామన్‌కు న్యూజెర్సీలో బ్రెయిన్, స్పైన్ క్యాన్సర్ నిపుణుడిగా మంచి పేరుంది.  ప్రస్తుతం ఆయన హాకెన్‌సాక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో న్యూరో ఆంకాలజీలో కో-చీఫ్‌గా పనిచేస్తున్నారు. పైలట్ లెనైన్స్ కూడా కలిగి ఉన్న ఆయన ఒకే ఇంజన్ ఉన్న సీఆర్22 ను స్వయంగా నడిపారని వెల్లడించారు. చెన్నైకి చెందిన రాజారామన్ కుటుంబం 1990ల్లో అమెరికాలో స్థిరపడింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...