Tuesday, June 14, 2011

నాలుగో వన్డేలో భారత్ ఓటమి

ఆంటిగ్వా,జూన్ 14:  వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో సోమవారం జరిగిన నాలుగో వన్డేలో  103 పరుగుల తేడాతో భారత్ ఓటమి  పాలైంది.  తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ సిమ్మన్స్ (78 బంతుల్లో 67; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. ఆరంభంలో వెస్టిండీస్ వేగంగా వికెట్లు కోల్పోయినా... సిమ్మన్స్‌తో పాటు పొలార్డ్ (72 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించడంతో కోలుకుంది. ఆఖరి ఓవర్లలో బాగ్ (57 బంతుల్లో 39; 3 ఫోర్లు), రస్సెల్ (14 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఆతిథ్య జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్ మూడు వికెట్లు తీసుకోగా... అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్, అశ్విన్‌లకు ఒక్కో వికెట్ లభించింది.  తరువాత భారత్  39 ఓవర్లలోనే 146 పరుగులకు  భారత జట్టులో అత్యధికంగా రోహిత్ శర్మ 39 పరుగులు, పార్థీవ్ పటేల్ 26, కోహ్లి 22, బద్రీనాథ్ 12, అశ్విన్ 15, రైనా 10 పరుగులు చేశారు. విండీస్ జట్టులో మార్టిన్ 4, రస్సెల్ 3 వికెట్లు, సమ్మి 2, సిమ్మన్స్ 1 వికెట్ పడగొట్టారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...