ప్రజారాజ్యం పార్టీ గల్లంతు

హైదరాబాద్,జూన్ 13: ఇక ప్రజారాజ్యం పార్టీ లేదు. చరిత్రలో కలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలుపడంతో ఆ పార్టీ ఉనికిని  కోల్పోయినట్లైంది. ఆ పార్టీ ఉదయించే సూర్యుని గుర్తు అస్తమించింది. విలీనం విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శాసనసభ స్పీకర్ కు ­కు తెలపనున్నారు.  సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా­గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు, ముఖ్యంగా అభిమానులు ఆశించారు. అవినీతికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం పోరాడతానని ఎన్నికల సమయంలో ఆయన ఆర్బాటంగా చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆ పార్టీలోనే కలిసిపోవడంతో ఆయనపై ఆశలు పెట్టుకున్న వారందరూ నిరుత్సాహానికి గురైయ్యారు. ఆయన మెగాస్టార్ ఇమేజ్ కూడా దెబ్బతింది. చిత్రపరిశ్రమలో సంపాదించుకున్న పేరుని రాజకీయాలలో పోగొట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయనకు యేం కట్ట బెడుతుందో వేచి చూడాలి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు