Monday, June 13, 2011

ప్రజారాజ్యం పార్టీ గల్లంతు

హైదరాబాద్,జూన్ 13: ఇక ప్రజారాజ్యం పార్టీ లేదు. చరిత్రలో కలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలుపడంతో ఆ పార్టీ ఉనికిని  కోల్పోయినట్లైంది. ఆ పార్టీ ఉదయించే సూర్యుని గుర్తు అస్తమించింది. విలీనం విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శాసనసభ స్పీకర్ కు ­కు తెలపనున్నారు.  సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా­గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు, ముఖ్యంగా అభిమానులు ఆశించారు. అవినీతికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం పోరాడతానని ఎన్నికల సమయంలో ఆయన ఆర్బాటంగా చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆ పార్టీలోనే కలిసిపోవడంతో ఆయనపై ఆశలు పెట్టుకున్న వారందరూ నిరుత్సాహానికి గురైయ్యారు. ఆయన మెగాస్టార్ ఇమేజ్ కూడా దెబ్బతింది. చిత్రపరిశ్రమలో సంపాదించుకున్న పేరుని రాజకీయాలలో పోగొట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయనకు యేం కట్ట బెడుతుందో వేచి చూడాలి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...