Sunday, June 12, 2011

దీక్ష విరమించిన రామ్‌దేవ్ బాబా

డెహ్రాడూన్,జూన్ 12: అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను యోగా గురు రామ్‌దేవ్ ఆదివారం విరమించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ నెరపిన దౌత్యం తో  రామ్‌దేవ్ బాబా దీక్ష విరమించారు.  గత తొమ్మిది రోజులుగా బాబా రామ్‌దేవ్ దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో కూడా ఆయన దీక్షను కొనసాగించారు. వివిధ ఆధ్యాత్మిక, మత నాయకుల సమక్షంలో రామ్‌దేవ్ బాబా దీక్ష విరమించినట్లు రవిశంకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. బాబా రామ్‌దేవ్ దీక్ష విరమించారని, కానీ పోరాటాన్ని ఆపలేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రామ్‌దేవ్ ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...